Posts

'ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం తప్పనిసరి'.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం..

'ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం తప్పనిసరి'.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం..   ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం తప్పనిసరి, అదీ అధికారం చేపట్టిన ప్రభుత్వ పనితీరుని సదా పరిశీలిస్తూ.. 'తప్పు-ఒప్పుల'పై ప్రతి పక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు విమర్శించడం మాములు విషయం. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు స్పందించి జవాబు ఇవ్వటం మామూలే. ఒకప్పుడు రాజకీయాలు అంటే హుందాగా, గౌరవంగా ఉండేవి.. విమర్శలు, ప్రతి విమర్శలు కూడా పాలసీల గురించి, ప్రభుత్వ విధి విధానాలను గురించే ఉండటం సర్వ సాధారణం. కానీ కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న హుందాతనం గౌరవం తగ్గిపోయాయి విమర్శలకు ప్రతి విమర్శలు విధాన పరమైనవి కాకుండా దారి తప్పి, నీతి తప్పి 'వ్యక్తిగత జీవితాల'పై విమర్శలు చేయటం ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడుతున్న మీడియాను అనుకూలంగా మార్చుకొని తప్పుడు ప్రచారాలు చేయటం అలవాటై పోయింది కొన్ని రాజకీయ పార్టీలకు. అది కాస్తా ఈ దశాబ్ద కాలం లో విపరీత ధోరణికి పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగి మీడియా, వెబ్‌సైట్స్, యూ ట్యూబ్ చానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. డబ్బు కోసం దిగజరిపోయి తప్పుడు ప్రచారాలు చేయటం ఒక ఆనవాయితీగా మార్చుకున్నా...

రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి..!

రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి..! భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏండ్లయిన ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రపంచ దేశాలన్నీ మారుతున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతికతను అందిపుచుకుంటూ అభివృద్ధి పథంలో పాయనిస్తుంటే భారతదేశంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో లోపం ఎక్కడ ఉంది అన్ని మన వ్యవస్థను మనమే శల్య పరీక్ష చేసుకోవాల్సిన సమయమిది. నాయకులకు ఎన్నుకోబడే వారిలో చాలా మంది కనీస పరిజ్ఞానం లేకుండా ఉంది. రాజకీయ నాయకత్వం అనేది ఒక బాధ్యతహుతమైన పదవి కనుక దీనికి సరైన అర్హత పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా చిన్న క్లర్క్, అటెండర్ ఉద్యోగులకు అర్హత పరీక్షలు నిర్వహిస్తారు. కానీ 5 ఏండ్ల ప్రజలను పాలించాల్సిన ప్రజా ప్రతినిధులకు ఎలాంటి అర్హత పరీక్ష ఉండదు. అసలు ఏ ప్రాతిపదిక మీద ఆధారంగా అతన్ని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకుంటున్నారున్నడానికి స్పష్టత లేదు. కేవలం ధన బలం, తమ సామాజిక వర్గానికి సపోర్ట్ ఒక్కటే రాజకీయంగా ఎదగడానికి పునాది అవుతుంది. ఇంకా కుటుంబ వ్యవస్థ, వారసత్వంగా నాయకులుగా ఎదుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఎంత బేవర్స్ గా తిరిగేవాడైతే అంత పరపతి, ఎంత డ...

నేర చరితులు అధికార పీఠం ఎక్కితే ఏమవుతుందో వైఎస్ జగన్ రుజువు

ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఒక అరాచక శైలిలో పరిపాలన కొనసాగిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజల్లో బీభత్స వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎవరినైన విమర్శించాలన్నా, ప్రశ్నించాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా పనిచేయడమో, ప్రేక్షకులుగా మారడమో జరుగుతుంది. అధికార పార్టీలో ఉన్న వారు ఇష్టారాజ్యంలా గుండాలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అన్న మాటకు, నానా బూతులు మాట్లాడుతుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అరాచకాన్ని సమర్థిస్తూ మాట్లాడారు! తాను రాజ్యాంగ హోదాలో ఉన్నానని చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగేతర శక్తులను ప్రోత్సహించేలా మాట్లాడడం, ఆయన ఫ్యాక్షనిస్టు మనస్తత్వాన్ని నిరూపిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడికక్కడ రాజకీయ, సామాజిక వాతావరణం మరింత కలుషితమైంది. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, ప్రభుత్వంపై భరోసా కోల్పోయిన ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ రకంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోంది. తన అరాచక అసమర్థ పా...

75 సంవత్సరాల భారతదేశం..

75 సంవత్సరాల భారతదేశం వేసిన అడుగులలో వెనకు మళ్ళీ చూసుకుంటే...!!! ౼ "నీ అడుగులు అడిగి చూడూ... నువ్వు నడచిన దూరం, నువ్వు కోల్పోయిన ఎందరో మహానుభావులు త్యాగాలను,కష్టాలను అడుగు...అయినా వీడదా ఈ పేదరికం, దారిద్య్రం వీడదా!". దీనికి సమాధానం #అవినీతిరాజకీయనాయకులు_మన_దేశాన్ని_పరిపాలిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు! బ్రిటీష్ పరిపాలనలో దోచుకున్న భారతదేశముకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయ్యాయి. కానీ ఈ దేశంలో ఇంకా స్వాతంత్ర్యము రాలేదు. ఎందుకంటే అపుడు స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వారు దోచుకున్నారు...ఇప్పుడు మన భారతీయులైన #రాజకీయనాయకులు మన దేశమును దోచుకుంటున్నారు. భారతదేశంలోనే పుట్టి #భరతమాతను దోచుకుంటున్నారు. ఎలాగంటే మనదేశంలో౼౼ అభివృద్ధి పేరుతో వివిధ ప్రాజెక్టులు, పథకాలు అంటూ ప్రజాధనాన్ని ప్రజలకు అందకుండానే అవినీతి ప్రాజెక్టులు, అవినీతి పథకాలుగా మారుస్తున్నారు. బ్రిటిష్ వారు అయితే మన దేశం వాళ్ళు కాదు కాబట్టి వారిని మన దేశం నుండి తరిమికొట్టాము. మరీ మన దేశంలో పుట్టి, మన దేశాన్ని దోచుకుంటున్నా ఈ #రాజకీయనాయకులను ఏమి చేయాలి? అని ఆలోచిస్తే...!!! సమాధానం దొరకదు, ప్రశ్నార్ధకం? కా...